Kandukur stampede :కందుకూరు ఘటన: రోజా సంచలన డిమాండ్!

చంద్రబాబు సభలో తొక్కిసలాట సందర్భంగా 8 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ మంత్రి రోజా స్పందించారు.

Update: 2022-12-29 06:57 GMT

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు సభలో తొక్కిసలాట సందర్భంగా 8 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ.2కోట్లు ఇవ్వాలని ఏపీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి 8 మంది మృతికి కారణమైందన్నారు. కాగా పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో నిన్న తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ తరపున రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా  రూ.23లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 

Also Read... 

Kandukur stampede: కందుకూరు ప్రమాదంపై స్పందించిన Pawan Kalyan 

Tags:    

Similar News