కార్మికులకు భారీ బీమా పథకం ప్రకటించిన చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-08-29 12:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు కార్మికుల హక్కులను రక్షిస్తూ, వారి సంక్షేమం కోసం పని చేయాలని అన్నారు. పరిశ్రమల యాజమనులతో కలిసి వారిని వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వమని, కార్మికుల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడబోమని తెలియ జేశారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు వెంటనే నిధులు విడుదల చేస్తామని, వాటితో ఆస్పత్రుల్లో మరింత అత్యాధునిక పరికరాలు, అన్ని రకాల ఔషధాలు తెప్పించాలని సీఎం కోరారు. గతంలో తాము అమలు చేసిన చంద్రన్న బీమాను మళ్ళీ పునరుద్దరిస్తామని తెలిపిన చంద్రబాబు నాయుడు, త్వరలోనే కార్మికుల రూ.10 లక్షల బీమా పథకానికి శ్రీకారం చూడతామని అన్నారు. 


Similar News