BREAKING: ఇళ్లపై విరిగిపడిన కొండ చరియలు.. ఇద్దరు దుర్మరణం

విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-08-31 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమైన ఘటన విజయవాడలోని మొగల్రాజపురం అమ్మ కల్యాణ మండపం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఎనిమిది మంది శిథిలాల కింద ఇరుక్కుపోగా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆరుగురిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. అందులో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అదేవిధంగా చుట్టుపక్కల ఇళ్ల వారిని కూడా ఖాళీ చేయిస్తున్నారు.


Similar News