Big Breaking:తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తాపడి ఏడుగురు దుర్మరణం

తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-09-11 00:59 GMT

దిశ, వెబ్‌డెస్క్:తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీడిపిక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో ఏడుగురు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవరపల్లి(Devarapalli) మండలం చిలకావారిపాకలు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో..సమిశ్రగూడెం(Samisragudem) మండలం తాడిమళ్ల(Tadimalla)కు చెందిన దేవాబత్తుల బూరయ్య(40), తమ్మిరెడ్డి సత్యనారాయణ(45), తాడి కృష్ణ(45), కత్తవ కృష్ణ(40) , కత్తవ సత్తిపండు(40), పి.చినముసలయ్య(35) అలాగే నిడదవోలు(Nidadavolu) మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ చనిపోయారు.గాయపడ్డ వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో మొత్తం 9మంది కూలీలు ఉన్నారు.లారీ బోల్తాపడటంతో అందులో ఉన్న జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు.కాగా ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. డీఎస్పీ దేవకుమార్,ఎస్సైలు శ్రీహరిరావు,సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News