Bhuvaneshwari: రాజమండ్రి ప్రజలు నా కుటుంబంతో సమానం.. నారా భువనేశ్వరి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు
రాజమండ్రి ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: రాజమండ్రి ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ప్రకాష్నగర్లో గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా.. తాను 53 రోజుల పాటు అక్కడే ఉన్నానని గుర్తు చేశారు. రాజమండ్రి ప్రజలు ఇచ్చిన ధైర్యం వేయి ఎనుగుల బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆపద సమయంలో ఆదుకున్న వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని భువనేశ్వరి ఎమోషనల్ అయ్యారు.