Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై కేసు నమోదు..కారణమిదే..!

టీటీడీ మాజీ చైర్మన్(Former TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-09-23 18:46 GMT

దిశ, వెబ్‌డెస్క్:టీటీడీ మాజీ ఛైర్మన్(Former TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.తిరుమల(Tirumala)లోని శ్రీవారి ఆలయం ముందు లడ్డూ వివాదం(Laddu Controversy)పై ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.కొండపైన ప్రమాణం చేసే సమయంలో రాజకీయ వ్యాఖ్యలు(Political Comments) చేయవద్దని తిరుమలకు చేరుకోకముందే కరుణాకర్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పోలీసులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా భూమన రాజకీయ వ్యాఖ్యలు చేశారని, దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.


Similar News