గుంటూరులో ఆడశిశువు విక్రయం

గుంటూరులో రూ.1.90 లక్షలకు ఓ ఆడశిశువును విక్రయించిన ఘటన వెలుగు చూసింది.

Update: 2024-09-11 14:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు(Gunturu)లో రూ.1.90 లక్షలకు ఓ ఆడశిశువును విక్రయించిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. కానీ మీరాబికి పుట్టిన శిశువు పురిటిలోనే కన్నుమూసింది. అయితే గత సోమవారం మీరాబి వద్ద మరో శిశువు ఉండగా అనుమానం వచ్చిన ఆసుపత్రి గైనకాలజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఐసీడీస్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. మీరాబీని, శిశువును పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా అసలు విషయం బయట పడింది. బాపట్ల జిల్లా చిన్న గంజాంకు చెందిన లక్ష్మీ అనే మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందగా.. ఈ విషయాన్ని తెలుసుకున్న మీరాబి లక్ష్మీ భర్త సుబ్రమణ్యంకు నచ్చజెప్పి రూ.1.90 లక్షలకు ఆ ఆడశిశువును కొనుక్కుందని తేలింది. ఆడశిశువును ఐసీడీస్ వసతి గృహానికి తరలించిన పోలీసులు.. మీరాబి, సుబ్రమణ్యం మీద కేసు నమోదు చేశారు.


Similar News