పిఠాపురంలో పవన్ గెలుపు ఫిక్స్.. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..!

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సమాప్తమైంది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ పోలింగ్ శనివారం

Update: 2024-06-01 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సమాప్తమైంది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇక్కడ పవన్ కల్యాణ్ గెలుస్తాడా..? వైసీపీ అభ్యర్థిని వంగ గీతా విజయం సాధిస్తారా..? అని ఓవరాల్ ఏపీ పాలిటిక్స్‌లోనే సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ ఆరా మస్తాన్ సంస్థ పిఠాపురం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఘన విజయం సాధిస్తారని పేర్కొంది. పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలు కాకినాడ, మచిలీపట్నంలోనూ ఆ పార్టీ విజయం సాధిస్తోందని అంచనా వేసింది. ఆరా మస్తాన్ ఫలితాలు చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.


Similar News