విషాదం.. రైలు కింద పడి ఏఎస్ఐ సూసైడ్

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

Update: 2024-07-03 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఏపీ వైఎస్సాఆర్ జిల్లా కమలాపురంలో నాగార్జున రెడ్డి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా యూనిఫామ్ పక్కన పెట్టి రైలు పట్టాల కిందపడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై ఏఎస్ఐ మృతదేహం లభ్యమైంది. రాత్రి విధులు ముగిశాక ఉదయాన్నే రైలు కిందపడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో ఏఎస్ఐ నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


Similar News