ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. 24 శాతానికి HRA పెంపు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ,

Update: 2024-07-29 10:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 16 శాతం ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచింది. 2025 జూన్‌ వరకు ఈ హెచ్ఆర్ఏ వర్తి్స్తుందని పేర్కొంది. పెంచిన హెచ్ఆర్ఏ మొత్తం రూ.25 వేలకు మించకుండా వర్తింప జేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ సిఫారులపై ఇంకా క్లారిటీ రానందున ఉద్యోగులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, హెచ్ఆర్ఆ పెంచుతూ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News