సీఎం చంద్రబాబు ఆదేశం.. హుటాహుటిన ఆ ఊరికి వెళ్లిన హోంమంత్రి అనిత

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం వెళ్లారు. ...

Update: 2024-06-21 13:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం వెళ్లారు. ఈపూరుపాలెనికి చెందిన బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు చలించిపోయారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. ఈ మేరకు ఆమె చీరాల మండలం ఈపురుపాలేనికి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబాన్ని హామీ ఇచ్చారు. దోషులను త్వరగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. 


Similar News