CM Chandrababu:నేడు ఏపీ ఈ- కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఛాన్స్!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.

Update: 2024-08-28 01:48 GMT

దిశ,ఏపీ బ్యూరో:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ మొదలవుతుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ బుధవారం ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు ఆన్‌లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. దీని నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.


Similar News