Delhi: అమిత్ షాను కలిసిన చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చ

కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిశారు...

Update: 2024-07-04 10:35 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిశారు. ఏపీకి ఆర్థిక సాయం, విభజన హామీలను షా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి నిధులు సహకాంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దేశ రాజధానిలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను వేర్వేరుగా ఏపీ సీఎం కలిశారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పోలవరం, రాజధాని అమరావతికి నెరవేర్చాలని కోరారు. అలాగే కేంద్రం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని అమిత్‌కు సీఎం చంద్రబాబు వినతి పత్రం అందజేశారు. ఇందుకు పీఎమ్ మోడీతో పాటు కేబినెట్ మంత్రులంతా సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటన ముగిసిన వెంటనే ఆయన రాష్ట్రానికి చేరుకోనున్నారు. 


Similar News