నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యపై మంత్రులు ప్రధానంగా చర్చించారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగ(Unemployment) సమస్యపై మంత్రులు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో 20 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పించేలా పారిశ్రామిక పాలసీని రూపొందించాలని నిర్ణయించారు. 2024-29 కాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాలను ఎస్కో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ(Industrial Policy) 4.0 ఉండాలని, 2030 నాటికి ఇంటింటికి ఓ పారిశ్రామిక వేత్త తయారు చేసేలా ఈ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు.
ఇంకా మరిన్ని అంశాలపైనా చర్చించిన మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ(AP Clean Energy Policy)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పునరుత్పాదక విద్యుత్, పంప్స్టోరేజి ద్వారా విద్యుత్ఉత్పత్తికి ఆమోదం తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ వనరుల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ పాలసీని రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమల్ని సైతం ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీలను నియమించాలని సమావేశంలో చర్చించారు. ఏపీ రాజధాని అమరావతి సెంటర్గా ఏపీ యాంటీ నార్కోటిక్టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.