వైసీపీకి మరో బిగ్ షాక్..టీడీపీ గూటికి మాజీ మంత్రి

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-10 08:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. దీంతో పార్టీ నేతలు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి వరుస షాక్‌లు తగలుతున్నాయి. అయితే తాజాగా వైసీపీకి మరో కీలక నేత, మాజీ మంత్రి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం సీఎం చంద్రబాబును కలవాలని చూసినా అది సాధ్యపడలేదు. వరద బాధితులకు తాజాగా రూ.50 లక్షల విరాళం అందించేందుకు ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అన్నీ విషయాలు తనకు తెలుసని త్వరలో ఓ సారి మాట్లాడుదామని శిద్దాతో చెప్పారని టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీలో ఆయన చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందని శిద్ధా వర్గీయులు చెప్పుకొంటున్నారు.


Similar News