కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన నులుకుర్తి వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2023-04-04 09:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన నులుకుర్తి వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సైతం గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుకు తన రాజీనామా లేఖను పంపించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తనకు సహకరించిన మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజుతో పాటు ఇతర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ అనేక పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని అయితే తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని వీడకూడదనే ఉద్దేశంతో పార్టీ బలోపేతం కోసం శ్రమించినట్లు తెలిపారు.

ఎంత కష్టపడినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నులుకుర్తి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్, ఏ పార్టీలో చేరబోతున్నాననేది త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇకపోతే నులుకుర్తి వెంకటేశ్వరరావు 1998లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలం డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో కాకినాడ రూరల్ జెడ్పీటీసీగా, 2006లో పెదపూడి జెడ్పీటీసీగా పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అధిరోహించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News