AP News:పవన్ కళ్యాణ్ను వెతుక్కుంటూ వచ్చిన వృద్ధురాలు..అక్కున చేర్చుకుని ఆమె కల నెరవేర్చిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
దిశ,వెబ్డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నేడు పంచాయతీరాజ్ కమిషనరేట్కి(Panchayat Raj Commissionerate) వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆకీవీడుకు చెందిన వృద్ధురాలు కృష్ణవేణి(75) పవన్ కళ్యాణ్కు తన కష్టాలు చెప్పుకోవాలని విజయవాడకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పంచాయతీరాజ్ కమిషనరేట్కు వస్తున్నారనే విషయం తెలుసుకోని గేటు బయటే కూర్చుని ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బయటకొస్తూ ఆమెను చూసిన ఆయన భోజనం చేయలేదని గ్రహించారు.
కారులో ఎక్కించుకుని ఆహారం పెట్టించాక ఆమె సమస్యలు(Problems) విన్నారు. కంకణాల కృష్ణవేణి భర్త మరణించారు. ఒక్కగానొక్క కొడుకు ముత్తయ్య బొమ్మలు అమ్ముకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఓ రేకుల షెడ్లో నివాసం ఉంటున్నారు. భర్త లేడని, పెన్షన్(Pension) చాలడం లేదని, కొడుకు పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలనడంతో ఆమె పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ వృద్ధురాలి బాధను విన్న పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు ఈ వృద్ధురాలి బాధలు తెలియచేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా అధికారులకు చెప్పి ఇంటి నిర్మాణానికి నిధులు ఇప్పించారు.