ఏపీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్... మూడు రోజులు వైన్స్ బంద్

ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది...

Update: 2024-06-01 11:41 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకూ మద్యం షాపులు మూసివేయాలని డీజీపీ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకే వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.  తమ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనుమతి ఉన్న వారు కౌంటింగ్ కేంద్రాల వద్దకు రావాలని, ఇతరులు రావొద్దని తెలిపారు. మరోవైపు ఏపీ ఫలితాలు విడుదల అయిన తర్వాత సైతం అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 


Similar News