Breaking: ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ...

Update: 2024-09-06 04:15 GMT

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు జాతీయ రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు ప్రవీణ్ కుమార్, చింతా కార్తీక్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News