స్నేహితులతో సరదా పందెం.. కేసీ కాల్వలో దూకిన ఆర్మీ జవాన్.. తర్వాత ఏమైందంటే?

కర్నూలు జిల్లాలో కేసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్(Army jawan) గల్లంతయ్యాడు.

Update: 2024-09-15 09:23 GMT

దిశ,వెబ్‌డెస్క్:కర్నూలు జిల్లాలో కేసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్(Army jawan) గల్లంతయ్యాడు. స్నేహితులతో పందెం కాసి పవన్(24) అనే యువకుడు కాల్వలో ఈతకు(swim) దిగాడు. ఈ క్రమంలో వరద ఉధృతి పెరగడం వల్ల ఆ యువకుడు వరదలో(Floods) కొట్టుకుపోయాడు. ఇది చూసి కంగారుపడిన అతని స్నేహితులు(friends) వెంటనే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది(Firefighters), పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పవన్ ప్రస్తుతం జమ్మూలో జవానుగా(Army jawan) పనిచేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు.


Similar News