మూడు నెలల చిన్నారిని బండకేసి కొట్టిన తండ్రి

తిరుపతిలోని శ్రీకాలహస్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య మనస్పదర్థలతో ఇంట్లో గొడవ జరిగింది.

Update: 2022-11-26 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: దంపతుల మధ్య వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై కోపంతో భర్త అభం శుభం తెలియని చిన్నారిని నేలకేసి కొట్టి చంపాడు. ఈ విషాద ఘటన శ్రీ‌కాళ‌హ‌స్తిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి శుకబ్రహ్మ ఆశ్రమం సమీపంలోని వాటర్‌ వర్క్స్‌ కాలనీకి చెందిన దంపతులు నివశిస్తున్నారు. ఈ దంపతులకు మూడు నెలల చిన్నారి సంతానం. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం అర్థరాత్రి మూడు నెలల చిన్నారి తీవ్రంగా ఏడుస్తుంది. దీంతో తండ్రి చిన్నారిని ఎత్తుకుని లాలించాడు. అయినప్పటికీ ఏడుపు ఆపకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్దామని భార్యను అడిగాడు. పసికందును ఆస్పత్రికి తీసుకెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త క్షణికావేశంలో త‌మ మూడు నెలల చిన్నారిని నేలకేసి కొట్టాడు. ఈ విషయాన్ని గమనించినస్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. డయల్ 100 ద్వారా చిన్నారిని ప్రైవేటే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి వివరాలు చేపట్టారు.


Also Read......


భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి


Similar News