గురుకుల హాస్టల్ నుంచి 40 మంది విద్యార్థులు పరార్.. అసలు విషయం ఇదే!
గురుకుల పాఠశాల హాస్టల్ నుంచి విద్యార్థులు పరారైన ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: గురుకుల పాఠశాల హాస్టల్ నుంచి విద్యార్థులు పరారైన ఘటన పల్నాడు (Palnadu) జిల్లా యడ్లపాడు (Yarlapadu)మండలం వంకాయలపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంకాయలపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు పరారయ్యారు. ఏకంగా హాస్టల్ ప్రహరీ దూకి అక్కడి నుంచి ఊడాయించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. వారి కోసం తీవ్రంగా గాలిస్తుండగా.. బోయపాలెంలోని కొండవీడు కొండలపై విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించి వారిని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు (DSP Nageshwara Rao) విద్యార్థులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు నిత్యం ఇబ్బంది పెడుతున్నారని స్టూడెంట్స్ తెలిపారు. హాస్టల్లో ఉండేదందుకు సరైన వసతులు లేకే ఆ పని చేసినట్లుగా డీఎస్పీకి వివరించారు.