బ్రేకింగ్: తిరుమల కొండలపై కలకలం రేపిన 3 హెలికాప్టర్లు

తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టడం సంచలనంగా మారింది.

Update: 2023-04-25 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టడం సంచలనంగా మారింది. నో ఫ్లయింగ్ జోన్ అయిన తిరుమల కొండలపై మంగళవారం మూడు హెలికాప్టర్లు ప్రయాణించాయి. అంతేకాకుండా శ్రీవారి ఆలయానికి అతి సమీపం నుండి ఈ హెలికాప్టర్లు వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. ఇది గమనించిన టీటీడీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే, నో ఫ్లయింగ్ జోన్ అయిన తిరుమల కొండపై నుండి ప్రయాణించిన ఆ మూడు హెలికాప్టర్లు ఇండిన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినవిగా గుర్తించారు.  కడప నుండి చెన్నై వెళ్లే క్రమంలో ఈ హెలికాప్టర్లు తిరుమల కొండపై నుండి ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News