నేడు బీజేపీ మ్యానిఫెస్టో.. ఆ అంశాలపైనే ప్రధాన ప్రస్తావన

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ రోజు ఆయన పశ్చిమబెంగాల్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఆయన పూర్వ మిడ్నాపూర్ లోని ఇగ్రా సభలో ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం కోల్‌కతలో మ్యానిఫెస్టో విడుదల చేస్తారని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా పశ్చిమబెంగాల్‌ను అంతర్జాతీయ ట్రేడింగ్, […]

Update: 2021-03-20 23:55 GMT

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ రోజు ఆయన పశ్చిమబెంగాల్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఆయన పూర్వ మిడ్నాపూర్ లోని ఇగ్రా సభలో ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం కోల్‌కతలో మ్యానిఫెస్టో విడుదల చేస్తారని పార్టీశ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

కాగా పశ్చిమబెంగాల్‌ను అంతర్జాతీయ ట్రేడింగ్, కామర్స్ క్లబ్‌గా తీర్చి దిద్దడం, రాష్ట్రంలోని రహదారులను, రైలు మార్గాలను అభివృద్ది వంటి అంశాలపై బీజేపీ ప్రధానంగా మ్యానిఫెస్టోలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News