వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్..

దిశ, వెబ్‌డెస్క్ : వైజాగ్ ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అఖిల్ బారి నుంచి నిన్ను కాపాడాలంటే రూ.10వేలు ఇవ్వాలని రామానాయుడు అనే యువకుడిని నిందితుడి స్నేహితులు అప్పన్న, హరి డిమాండ్ చేశారు. వరలక్ష్మి హత్యకు ముందు రామానాయుడుతో సన్నిహితం మెలిగినట్లు తెలుస్తోంది. అది సహించలేక అఖిల్ పలుమార్లు రామానాయుడుకి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ వీరి మధ్య సన్నిహిత్యం పెరగడంతో అఖిల్ వరలక్ష్మిని హత్య చేయాలని పన్నాగం […]

Update: 2020-11-07 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వైజాగ్ ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అఖిల్ బారి నుంచి నిన్ను కాపాడాలంటే రూ.10వేలు ఇవ్వాలని రామానాయుడు అనే యువకుడిని నిందితుడి స్నేహితులు అప్పన్న, హరి డిమాండ్ చేశారు.

వరలక్ష్మి హత్యకు ముందు రామానాయుడుతో సన్నిహితం మెలిగినట్లు తెలుస్తోంది. అది సహించలేక అఖిల్ పలుమార్లు రామానాయుడుకి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ వీరి మధ్య సన్నిహిత్యం పెరగడంతో అఖిల్ వరలక్ష్మిని హత్య చేయాలని పన్నాగం వేశాడు. అదునుచూసి వరలక్ష్మి ఒంటరిగా ఉన్న సమయంలో బ్లేడ్‌తో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.

ప్రస్తుతం అఖిల్ పోలీసుల అదుపులో ఉండగా.. అతని స్నేహితులు తనను డబ్బులు అడిగి బెదిరింపులకు గురిచేస్తున్నారని రామానాయుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెదిరింపులకు పాల్పడుతున్న అప్పన్న, హరిలను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News