కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్తుండగా అనుకోని సంఘటన.. చిన్నారి మృతి..

దిశ, కామారెడ్డి రూరల్ : కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై సిద్దిపేటలో జరిగే పెళ్లికి వెళ్తుండగా వెనక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తల్లిదండ్రులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నాగరాజు, రేఖ దంపతులిద్దరూ తమ కూతురు వైభవితో కలిసి సిద్దిపేటలో జరుగుతున్న పెళ్లికి బైక్‌పై వెళ్తున్నారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులోని 44 […]

Update: 2021-12-19 01:38 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై సిద్దిపేటలో జరిగే పెళ్లికి వెళ్తుండగా వెనక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తల్లిదండ్రులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నాగరాజు, రేఖ దంపతులిద్దరూ తమ కూతురు వైభవితో కలిసి సిద్దిపేటలో జరుగుతున్న పెళ్లికి బైక్‌పై వెళ్తున్నారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులోని 44 నెంబరు జాతీయ రహదారిపై వారికి ప్రమాదం జరిగింది. వారిని బైక్‌ను వెనక నుండి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో వైభవీ (8) అక్కడికక్కడే మృతి చెందగా నాగరాజు, రేఖలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని దేవునిపల్లి పోలీసులు చెప్పారు.

Tags:    

Similar News