ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొని.. ఉద్యోగి మృతి

దిశ, మెదక్: ఆగి ఉన్న ట్రాక్టర్ ను కారు ఢీకొని ఉద్యోగి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. ఈ సంఘటన చిన్న శంకరం పెట్ మండల పరిధిలోని ఎస్ కొండాపూర్ గ్రామ శివారులో మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మెదక్ పట్టణానికి చెందిన మల్లం రాజేష్ 32 తన భార్య తల్లితో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాదులో పనులు ముగించుకొని తిరిగి కారులో మెదక్ […]

Update: 2021-12-19 09:24 GMT

దిశ, మెదక్: ఆగి ఉన్న ట్రాక్టర్ ను కారు ఢీకొని ఉద్యోగి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. ఈ సంఘటన చిన్న శంకరం పెట్ మండల పరిధిలోని ఎస్ కొండాపూర్ గ్రామ శివారులో మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మెదక్ పట్టణానికి చెందిన మల్లం రాజేష్ 32 తన భార్య తల్లితో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాదులో పనులు ముగించుకొని తిరిగి కారులో మెదక్ వస్తుండగా ఎస్ కొండాపూర్ గ్రామ శివారులోని ఎడిప్పల్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుండి కారు బలంగా ఢీకొంది.

కాగా ఈ ప్రమాదంలో రాజేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఎల్ఐసి‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. డ్రైవర్ శ్రీనివాస్, నవ్య, పద్మాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న చిన్న శంకరం పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మెదక్ లోని ఓ ప్రైవేటు దావఖాన కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్న శంకరం పేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News