మనస్తాపంతో యువరైతు ఆత్మహత్య..

తోగుట మండలం కానుగల్ గ్రామంలో కాముని రాజు (30) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-09-18 14:33 GMT

దిశ, మిరుదొడ్డి : తోగుట మండలం కానుగల్ గ్రామంలో కాముని రాజు (30) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట ఎస్సై రవి కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటి నుంచి కాపురానికి రాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పాలవడంతో మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తన వ్యవసాయ పొలంలో గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని భార్య దివ్య (26) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Similar News