గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..

Update: 2023-12-25 16:26 GMT

దిశ, నవీపేట్: కుటుంబ తగాదాలతో మనస్తాపం చెంది బాసర గోదావరిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ పట్టణం సీతారాం నగర్‌కు చెందిన అంకం సావిత్రి కుటుంబ తగాదాలతో మనస్తాపం చెంది సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బాసర గోదావరిలో దూకేందుకు ప్రయత్నం చేసింది. అయితే బాసర నుండి యాంచకు వస్తున్న మహేష్, జీవన్ లు చూసి.. ఆమేను రక్షించి.. యంచ సర్పంచ్ లహరి ప్రవీణ్ కు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళ తో మాట్లాడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.


Similar News