వేధింపులు తట్టుకోలేక యువకుడు బలవన్మరణం

వేధింపులు తట్టుకోలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-09-12 12:16 GMT

దిశ,మహేశ్వరం : వేధింపులు తట్టుకోలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మురళి నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం...మురళీనగర్ గ్రామానికి చెందిన మూడావత్ పురందాస్ (32)కు వివాహం కాలేదు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో పురందాస్ చనువుగా ఉండి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు జరిగాయి. ఈనెల 7వ తేదీన పురందాస్​ వాళ్ల అన్న శంకర్ కి ఆ మహిళ ఫోన్ చేసి మీ తమ్ముడు నా గురించి ఊరు మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తెలిపింది.

    పురందాస్​ని తీసుకొని రాకుంటే మీ ఇంటికి వచ్చి తాను చనిపోతానని బెదిరించింది. శంకర్ వెంటనే పురందాస్​కి ఫోన్ చేసి అడగగా అతను ఏమీ చెప్పలేదు. అనంతరం పురందాస్ అదే రాత్రి పురుగుల మందు తాగి చనిపోతున్నానని శంకర్ కు వాయిస్ మేసేజ్ చేశాడు. వెంటనే శంకర్ వాళ్ల పొలం వద్దకు వెళ్లి చూడగా పురందాస్ పురుగుల మందు తాగి కిందపడి ఉన్నాడు. వెంటనే పురందాస్ ను ఓవైసీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పురందాస్ బుధవారం రాత్రి 8:30 సమయంలో ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

Tags:    

Similar News