లింగంపేటలో భారీ చోరీ..

లింగంపేట్ మండల కేంద్రంలోని మత్తడి కిందిపల్లి పరిధిలో శనివారం సాయంత్రం చోరీ జరిగినట్లు ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు.

Update: 2023-12-10 11:35 GMT

దిశ, లింగం పేట్ : లింగంపేట్ మండల కేంద్రంలోని మత్తడి కిందిపల్లి పరిధిలో శనివారం సాయంత్రం చోరీ జరిగినట్లు ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు. గ్రామానికి చెందిన పద్మ నర్సింలు కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లినట్లు తెలిపారు. వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి ఉన్నట్లు వారు తెలిపారు. బీరువాలు దాచి ఉంచిన ఐదు తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు 20వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు క్లూస్ సిమ్ సభ్యులు పరిశీలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు.

Tags:    

Similar News