అతివేగం నిండుప్రాణం తీసింది

నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిండు ప్రాణం బలికొంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారామ్ తండా చౌరస్తా రాజ్ దాబా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది.

Update: 2024-08-21 15:46 GMT

దిశ , కంగ్టి : నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిండు ప్రాణం బలికొంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారామ్ తండా చౌరస్తా రాజ్ దాబా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామస్తులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాల లక్ష్మణ్ (62) బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుమార్తె గ్రామమైన తుర్క వాడగమ నుండి స్వగ్రామమైన గాజుల్ పాడ్ కు నడుచుకుంటూ

    వెళ్తున్న క్రమంలో వాడగమ శివారులోని రాజ్ దాబా వద్ద కారు డ్రైవర్ అతివేగంగా , అజాగ్రత్తగా నడుపుతూ లక్ష్మణ్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో నిజాంపేట్ వద్ద మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News