తాత,మనవరాలుని కాటేసిన పాము…మనవరాలు మృతి, తాతకు అస్వస్థత

నిద్రిస్తున్న తాత మనవరాలును పాము కాటు వేయడంతో చిన్నారి మృతి చెందగా, తాత అస్వస్థతకు గురయ్యాడు

Update: 2024-07-09 09:02 GMT

దిశ : నాగిరెడ్డిపేట్ : నిద్రిస్తున్న తాత మనవరాలును పాము కాటు వేయడంతో చిన్నారి మృతి చెందగా, తాత అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జప్తి జానకంపల్లి గ్రామానికి చెందిన జోడు సంగమేశ్వర్ కూతురు వైష్ణవి(7) అనే చిన్నారి తో పాటు వైష్ణవి తాత శంకరయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు ఆవరణలో సోమవారం రాత్రి నిద్రిస్తుండగా వైష్ణవిని పాము కాటు వేయడంతో వైష్ణవి ఏడుస్తుండగా మనవరాలిని తాత శంకరయ్య దగ్గరికి తీసుకుంటున్న సమయంలో పాము శంకరయ్యను కూడా కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు తాత మనవరాలు ఇద్దరిని కామారెడ్డి లోని ఆస్పత్రికి తరలించగా వైష్ణవి మృతి చెందిందన్నారు. శంకరయ్యను మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నట్లు తెలిపారు. చిన్నారి వైష్ణవి పాము కాటుతో మృతి చెందడంతో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Similar News