లారీని ఢీకొన్న కంటైనర్ డ్రైవర్ మృతి..

కామారెడ్డి పట్టణ శివారులో ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు.

Update: 2024-09-03 17:24 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణ శివారులో ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఐదున్నర ప్రాంతంలో హర్యానా నుంచి జహీరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీ కామారెడ్డి పట్టణ శివారులో ఉన్న నేషనల్ హైవే డాబా వద్దకు చేరుకునే సమయానికి అప్పటికే అక్కడ నిర్లక్ష్యంగా ఎలాంటి సూచికలు లేకుండా నిలిపిన తమిళనాడుకు చెందిన లారీని ఢీకొంది.

ఈ ఘటనలో కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ షారుక్ ఖాన్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు షారుక్ ఖాన్ రాజస్థాన్ రాష్ట్రం భారత్ పురా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుని బంధువు అక్బర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోడ్డుపై నిర్లక్ష్యంగా లారీని నిలిపిన మధురై జిల్లా తిరునగర్ కు చెందిన డ్రైవర్ రాజ పండిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు.


Similar News