పాముకాటుకు రోజుకొకరు బలి.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కరువు

ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల్ హాజీపూర్ బ్రాహ్మణపల్లి వెలుట్లపేట పలు గ్రామాలకు చెందిన, రైతులకు ఈ నెలలో సుమారు 20 మందికి పాము కాటు వేయగా అందులో నేటితో 15వ వ్యక్తి మృతి చెందారు.

Update: 2024-07-14 15:10 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల్ హాజీపూర్ బ్రాహ్మణపల్లి వెలుట్లపేట పలు గ్రామాలకు చెందిన, రైతులకు ఈ నెలలో సుమారు 20 మందికి పాము కాటు వేయగా అందులో నేటితో 15వ వ్యక్తి మృతి చెందారు. 15 రోజుల్లో 15 మంది వ్యక్తులు పాముకాటుకు మృతి చెందారు. శనివారం ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి పాముకాటుకు మృతి. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కంభం నాగయ్య ( 43 ) మధ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా నల్ల కట్లపాము కరవగా అతనిని చికిత్స నిమిత్తం, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, మెరుగైన చికిత్స సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం 7:30 గంటలకు మృతి చెందినట్లు అతని భార్య కంభం సత్యవ్వ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ తెలిపారు.


Similar News