Gujarat : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి.. 14 మందికి గాయాలు

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బస్సు పశువుల మందను తప్పించబోయి, అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది.

Update: 2024-09-29 12:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బస్సు పశువుల మందను తప్పించబోయి, అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ అదుపు కోల్పోవడంతో బస్సు డివైడర్‌ను దాటేసి.. రోడ్డుకు మరోవైపు నుంచి వెళ్తున్న రెండుకార్లు, ఒక బైక్‌ను ఢీకొట్టింది. గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో ఉన్న ద్వారక - ఖంబాలియా నేషనల్ హైవే సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, 14 మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఖంబాలియా పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలు ఆదివారం ఉదయం బయటికి వచ్చాయి. మృతులను గుర్తించి వారి కుటుంబాలకు సమాచారాన్ని అందజేశారు.


Similar News