నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే మృతి

మండలంలోని కొత్తూరు గ్రామ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అల్వాల కోటయ్య (55) అనే వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-08-24 12:06 GMT

దిశ, లక్షెట్టిపేట : మండలంలోని కొత్తూరు గ్రామ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అల్వాల కోటయ్య (55) అనే వ్యక్తి మృతి చెందాడు. జెండా వెంకటాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిన కోటయ్య రాత్రి స్వగ్రామమైన దండేపల్లికి రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక ఎస్సై పి.సతీష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News