కోటగిరిలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
కోటగిరి మండల కేంద్రంలో అక్రమంగా ఒక రైస్ మిల్లుకు తరలించిన పిడీఎస్ బియ్యం వాహనాన్ని సివిల్ సప్లై డీటి నిఖిల్ పట్టుకున్నారు.
దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో అక్రమంగా ఒక రైస్ మిల్లుకు తరలించిన పిడీఎస్ బియ్యం వాహనాన్ని సివిల్ సప్లై డీటి నిఖిల్ పట్టుకున్నారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎత్తోండ రోడ్డు వైపు గల ఒక రైస్ మిల్లుకు సుమారు 80 క్వింటాల పీడీఎస్ బియ్యం తరలించిన రీసైక్లింగ్ చేయడం కోసమే ప్రయత్నిస్తుండగా స్థానిక ఎస్ఐ సందీప్ తో కలసి రైస్ మిల్లు వద్ద ఐచర్ వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేశామని ఆయన అన్నారు.