HYD: ఫిల్మ్‌నగర్‌లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు బలి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లో జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి ఒకరు బలయ్యారు.

Update: 2024-04-02 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లో జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి ఒకరు బలయ్యారు. డ్రైనేజీ కోసం జలమండలి అధికారులు తవ్వించిన గుంతలో పడి మంగళవారం ఉదయం ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఇష్టారీతిన గోతులు తవ్వి.. నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఒక ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుడి ఫిర్యాదుతో సంబంధిత కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News