చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

మండలంలోని పరమల గ్రామానికి చెందిన ఈర్ల రమేష్ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Update: 2023-12-15 16:22 GMT

దిశ, లింగంపేట : మండలంలోని పరమల గ్రామానికి చెందిన ఈర్ల రమేష్ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం పూట గ్రామ శివారులోని చెరువులోకి రమేష్ (32) దూకినట్లు గ్రామస్తులు తెలిపారు. రమేష్ చెరువులో దూకిన విషయాన్ని గ్రామస్తులకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లి బయటకు తీసినప్పటికీ రమేష్ చనిపోయినట్లు తెలిపారు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News