చేతిపై ఆర్ఆర్ఆర్ పచ్చబొట్టు.. మృతుడి ఆచూకీ కోసం ఎస్ఐ కీలక ప్రకటన

నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు.

Update: 2024-09-01 07:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు.రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి రైల్వే పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు. మృతుడి వద్ద బాన్సువాడ నుంచి నిజామాబాద్ కు వచ్చిన బస్సు టికెట్ లభ్యమైందన్నారు. అతని చెయ్యిపై ఆర్ఆర్ఆర్ అనే పచ్చబొట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658591 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సాయిరెడ్డి కోరారు.


Similar News