చేతబడి చేస్తోందని మహిళను కొట్టి చంపిన దుండగులు.. కోర్టు కీలక తీర్పు

నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి మహిళ హత్య కేసులో నిజామాబాద్ కోర్టు కీలక తీర్పు చెప్పింది.

Update: 2024-03-22 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి మహిళ హత్య కేసులో నిజామాబాద్ కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2018లో జిల్లాలో భారతి అనే మహిళను నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేశారు. చేతబడి నెపంతో కొట్టి చంపారు. కేసును శుక్రవారం విచారణకు స్వీకరించిన కోర్టు.. నిందితులు నలుగురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News