మైనర్‌ బాలిక మృతి…అనుమానాలు‌ వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

జిల్లాలో ఓ మైనర్ బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.

Update: 2024-09-21 15:41 GMT

దిశ,‌ గద్వాల: జిల్లాలో ఓ మైనర్ బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. వివరాలోకి వెళ్లితే... ఈనెల 12న‌ కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచనల మేరకు అక్కడ నుంచి కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలిక‌ చికిత్స పొందుతు శుక్రవారం మృతి చెందింది. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎవరిపైన అనుమానాలు‌ ఉంటే పోలీసులకు తెలియపరుచాలని గ్రామస్తులను కోరినట్లు తెలిసింది. కాగ మైనర్ బాలిక ఆత్మహత్య పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. బాలిక ఆత్మహత్య లైంగిక వేధింపులా లేక ఆరోగ్య సమస్యల అనే కోణం పై పోలీసుల దర్యాప్తులో తేలనుంది. బాలిక ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


Similar News