తెలివి మీరిన దొంగలు.. కారం పొడి చల్లి భారీ చోరీ..

నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి తాళం వేసిన మూడు ఇండ్లలో భారీగా బంగారం, నగదు, వెండి వస్తువులు అపహరించి పోయినట్లు బాధితులు తెలిపారు.

Update: 2024-07-17 11:37 GMT

దిశ, ఆలూర్ : నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి తాళం వేసిన మూడు ఇండ్లలో భారీగా బంగారం, నగదు, వెండి వస్తువులు అపహరించి పోయినట్లు బాధితులు తెలిపారు. సుమారు 20 తులాలు బంగారం, 18 తులాలు వెండి, 11 లక్ష రూపాయల నగదు అపహరించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.


Similar News