దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి మృతి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి గురువారం మృతి చెందింది.

Update: 2023-12-21 04:54 GMT

దిశ, భిక్కనూరు : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి గురువారం మృతి చెందింది. కామారెడ్డి జిల్లా ఉమ్మడి భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన పుట్టకొక్కుల లస్మవ్వ (89) అనారోగ్యంతో బాధపడుతూ వేకువజామున మృతి చెందింది. లస్మవ్వ అంత్యక్రియలు శివాయిపల్లి గ్రామంలో ఈరోజు జరుపనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన అమరవీరుల కుటుంబాల సభ్యులు, జేఏసీ నాయకులు శివాయిపల్లి గ్రామానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.


Similar News