Road accident : రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలు..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శివారులో ట్రాక్టర్ కారు ఢీకొన్న సంఘటనలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-07-23 07:40 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శివారులో ట్రాక్టర్ కారు ఢీకొన్న సంఘటనలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకెళితే మంచిర్యాల నుంచి కాగజ్ నగర్ కు భార్యాభర్తలు గొల్లపూడి రవికుమార్, గొల్లపూడి అనూష జ్యోతి కారులో వెళుతున్నారు. సరిగ్గా కన్నాల జాతీయ ప్రధాన రహదారిలో యూటర్న్ చేస్తున్న టాక్టర్ ను కారు ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని బెల్లంపల్లి హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స చేసిన ప్రభుత్వ వైద్యులు వారిని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి రూరల్ సీఐ హఫ్జలోద్దీన్, టూ టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ల గురజాల ఎస్సై నరేష్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News