పెనుబల్లిలో చైన్ స్నాచర్ల హల్చల్

పెనుబల్లి (వీఎం బంజర్) పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు హల్చల్​ చేశారు.

Update: 2024-09-20 09:31 GMT

దిశ,సత్తుపల్లి : పెనుబల్లి (వీఎం బంజర్) పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు హల్చల్​ చేశారు. మండలంలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే మీదుగా హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు కొత్త కారాయిగూడెం (చిన్నమ్మ గూడెం) గ్రామం వైపు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తున్న వీఎం బంజర్ గ్రామానికి చెందిన మోదుగు కుమారి (45) మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు.

    అనంతరం వీరు తిరువూరుకు చెందిన కిక్కిరెడ్డి పద్మ దంపతులను వెంబడించి కుప్పెనకుంట్ల శివారులో వారి ద్విచక్ర వా హనాన్ని ఢీకొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. అలాగే విస్సన్నపేట, తిరువూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో రెండు నేరాలకు పాల్పడినట్లు పెనుబల్లి పోలీసులు తెలిపారు. నిందితులకోసం తిరువూరు, విస్సన్నపేట, సత్తుపల్లి , వేంసూరు పోలీసులు కూడా గాలిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల ఆచూకీ తెలిసినవారు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ, డయల్​ 100 కానీ కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. 

Tags:    

Similar News