విహార యాత్రకు వెళ్లి అనంత లోకాలకు

నాగార్జునసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ మృతి చెందారు.

Update: 2024-09-18 13:54 GMT

దిశ,గద్వాల : నాగార్జునసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ మృతి చెందారు. పెబ్బెర్ మండలం యాపర్ల గ్రామానికి చెందిన శ్రావణి(27) కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కాబోయే భర్తతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్ డ్యాం చూడటానికి కారులో వెళ్లింది. నాగార్జునసాగర్ డ్యాం సమీపంలో దెయ్యాల గండి వద్ద ఆగి ఉన్న వారి కారును వెనుకనుంచి లారీ ఢీ కొట్టడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. కాబోయే భర్తకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారన్న సమాచారం తెలియాల్సి ఉంది. కాగా శ్రావణికి ఇటీవలే ఎంగేజ్మెంట్ అయిందని, కాబోయే భర్తతో కలిసి నాగార్జున సాగర్ డ్యాం చూడటానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు‌.

Tags:    

Similar News