చేపలు పడుతుండగా ఫిట్స్​ వచ్చి....

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అలీ (40) శనివారం ఉదయం 11 గంటల సమయంలో పోచమ్మ రేవులో చేపలు పట్టడానికి వెళ్లి ఫిట్స్ రావడంతో నీళ్లలో పడి మృతి చెందాడు.

Update: 2024-09-07 14:36 GMT

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అలీ (40) శనివారం ఉదయం 11 గంటల సమయంలో పోచమ్మ రేవులో చేపలు పట్టడానికి వెళ్లి ఫిట్స్ రావడంతో నీళ్లలో పడి మృతి చెందాడు. ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి నుండి చేపలు పట్టడానికి వెళ్లిన సయ్యద్ సలీం ఎంతకూ రాకపోవడంతో అతని భార్య రీహన బేగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడికి వెళ్లి వెతకగా నీటిలో చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. 

Tags:    

Similar News