తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులు మృతి

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులకు పైకి

Update: 2024-07-17 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులకు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News